వేదికను మార్చే యోచనలో కెసిఆర్

కెసిఆర్ తన వేదికను మార్చుకునే అవకాశం ఏ మాత్రం లేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు. కోనాయపేటకు వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి సిద్ధిపేటకు కెసిఆర్ చేరుకుంటారని ఆయన చెప్పారు. కెసిఆర్ అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. ఈ స్థితిలో కెసిఆర్ ను గృహ నిర్బంధం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గృహ నిర్బంధం చేస్తే ఇంట్లోనే ఆయన దీక్షను సాగిస్తారని చెబుతున్నారు. తనను ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడ దీక్షకు కూర్చుంటానని, జైల్లో పెడితే అక్కడ కూడా దీక్ష సాగిస్తానని కెసిఆర్ ఇదివరకే చెప్పారు.












Click it and Unblock the Notifications