కాటన్ కు వైజాగ్ లోనూ అదే ఆదరణ
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సర్ ఆర్థర్ కాటన్ వారసులకు రాష్ట్రంలో జరుగుతున్న జలయజ్ఞం కార్యక్రమాలు చూపించాలని తనకు గతంలో సూచించారని గుర్తు చేసుకున్నారు. ఏయూ వీసీ బీల సత్యనారాయణ మాట్లాడుతూ, కాటన్ దొర నిర్మించిన ప్రాజెక్టుల కారణంగానే గోదావరి, కృష్ణా డెల్టాలు సస్యశ్యామలమయ్యాయన్నారు. ఈ సందర్భంగా కాటన్ దంపతులు అక్కడి కాటన్దొర విగ్రహానికి పూలమాలలు వే సి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాటన్ దంపతులను ఘనంగా సత్కరించారు. మెటలర్జికల్ విభాగపు అదనపు భవనాన్ని కాటన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి, జ్ణానసుందరరావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ కె.బి.ఎస్.ఎల్.ఎన్.రాజు, ప్రిన్సిపాల్ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
వారు అంతకు ముందు పాతపోస్టాఫీస్ వద్దనున్న క్వీన్మేరీ చర్చిని సందర్శించారు. పక్కనే ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత బోటులో పోర్టును సందర్శించారు. విశాఖలో పోర్టు అవసరమని, భవిష్యత్లో ఈ పోర్టు ఎంతో అభివృద్ధి చెందుతుందని సర్ ఆర్థర్ కాటన్ ఒక పుస్తకంలో రాసిన విషయాన్ని పోర్టు సిబ్బంది రాబర్ట్ చార్లస్ కాటన్కు చూపించారు. ఈ సందర్భంగా పోర్టు సిబ్బంది కాటన్ దంపతులను జ్ఞాపికతో సత్కరించారు.