ప్రత్యేక తెలంగాణ ఆందోళన ఉద్ధృతం, హింసాత్మకం
వరంగల్లో ఓ ఆర్టీసీ, రెండు ప్రైవేటు బస్సులను ధ్వంసం చేశారు. కరీంనగర్లో వాటర్ ట్యాంక్లు ఎక్కి తెలంగాణ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఏపీ ఎక్స్ప్రెస్ను నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించి అనంతరం దగ్థం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బస్స్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. మొత్తంమీద తొలిరోజు బంద్లో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజాప్రతినిధుల ఆస్తులకు భారీగానే నష్టం వాటిల్లింది.
Comments
Story first published: Sunday, December 6, 2009, 14:28 [IST]