వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణేతర ఎంపీలతో మొయిలీ భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో విడతలు విడతలుగా మంతనాలు జరుపుతున్నారు. మంగళవారంనాడు తొలుత కొంత మంది పార్లమెంటు సభ్యులతో భేటీ అయిన ఆయన తర్వాత తెలంగాణేతర ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ సమావేశంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 14 మంది ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

మొయిలీతో భేటీ అనంతరం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారుతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణపై రేపటి లోగా సోనియా గాంధీ నిర్ణయం వెలువరిస్తారని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కన్నా తెంలగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేత దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవడంపైనే కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెడుతోంది. కెసిఆర్ తో దీక్షను విరమింపజేయడం ఎలాగనే విషయం వారికి తట్టడం లేదు. దీంతోనే కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు సతమతమవుతున్నారు. తెలంగాణ విషయంలో తెలంగాణేతర ఎంపీలు దిగి రావడం లేదు. దీంతో అధిష్టానం సతమతమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X