హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ: పంటల బీమాపై రభస, వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: పంటల బీమా పరిహారం చెల్లింపుపై గురువారం శాసనసభలో తీవ్ర రభస జరిగింది. పంటల బీమా పరిహారం చెల్లింపులో జాప్యం జరిగిదంటూ తెలుగుదేశం సభ్యులు విమర్శలు చేశారు. పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని తెలుగుదేశం సభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలో పట్టుబట్టారు. పరిహారం చెల్లింపులు జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, త్వరలో కేంద్రం నుంచి నిధులు వస్తాయని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. అయితే దానితో తెలుగుదేశం సంతృప్తి చెందలేదు. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత నెలాఖరులోగా రైతులకు పంటల బీమా పరిహారం అందుతుందని రోశయ్య చెప్పారు.

రోశయ్య సమాధానంతో సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బీమా పథకం లేనే లేదని వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగుదేశం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పయ్యావుల కేశవ్ విమర్శించారు.సభ సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. రెండు రోజుల పాటు తెలంగాణ అంశంపై అట్టుడికిన శాసనసభ గురువారం నాడు సజావుగా మొదలైంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X