హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి: పయ్యావుల

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: విద్యార్థి ఉద్యమాల విషయంలో పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్న హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా రాయలసీమ, కోస్తాంధ్ర శాసనభ్యుల సమావేశానంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజీనామాను కోరుతారా అని మీడియా ప్రతినిధులు అడిగితే ప్రాంతీయ ఉద్యమాలను అపహాస్యం చేయవద్దని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు మూడు ప్రాంతాలకు చెందినవాడని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తమ రాజీనామాలను స్పీకర్ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. రహదారులను దిగ్బంధం చేస్తామని ఆయన అన్నారు. రైల్ రోకో నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

సమైక్య నినాదానికి మద్దతుగా రాజీనామా చేయని కోస్తాంధ్ర, రాయలసీమ శాసనసభ్యుల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన చెప్పారు. మంత్రులు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పరామర్శించాడనికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావుకు సబితా ఇంద్రారెడ్డి అనుమతి ఇచ్చారని, ఎస్కేయూ విద్యార్థులను తమ శాసనసభ్యుడు రామకృష్ణ వెళ్తే అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఉద్యమాల సందర్బంగా సబితా ఇంద్రారెడ్డి వేర్వేరు పద్ధతులు అనుసరించడం సరి కాదని ఆయన అన్నారు. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రానికంతా హోం మంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X