వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ వనితలతో వ్యభిచారం గుట్టు రట్టు

By Santaram
|
Google Oneindia TeluguNews

Hitech City
హైదరాబాద్: విదేశీ యువతులతో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది.ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, ఉజ్బెకిస్థాన్‌ యువతితో సహా ఇద్దరు యువతులకు విముక్తి కల్పించినట్లు డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి కోసం వేటాడుతున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన అమిత్‌ అరోరా బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబయిల్లోని వ్యవస్థీకృత వ్యభిచార గృహాలను సందర్శించే వాడు. అక్కడున్న యువతులను పది రోజులకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌ తీసుకువచ్చేవాడు.

కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన దీపక్‌ గుప్తా, జుగల్‌ సాయంతో నగరంలో వ్యభిచార కార్యకలాపాలు సాగించే వాడు. అమిత్‌ ఇంటర్‌నెట్‌లోని ఓ వెబ్‌సైట్‌తో పాటు పత్రికల్లోనూ వివిధ రకాలుగా ఫోన్‌ నెంబర్లతో కూడిన ప్రకటనలు ఇచ్చే వాడు. ఈ ఫోన్‌ నెంబర్లకు సంప్రదించిన వారి వివరాలను దీపక్‌, జుగల్‌కు అందించే వాడు. వీరు ఆ విటుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరితో రూ.20 వేల నుంచి రూ.30 వేలకు బేరం కుదుర్చుకునే వారు. ఈ విధంగా రోజుకు ప్రతి సెక్స్‌వర్కర్‌ వద్దకు కనీసం ఇద్దరు విటులను తీసుకువచ్చేవారు.

ఆపై లాడ్జిలు, హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. విటుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఆన్‌లైన్‌ అకౌంట్‌ ద్వారా అమిత్‌కు పంపేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు బి.నవీన్‌ రెడ్డి, కె.శ్రీనివాస్‌, ఎన్‌సీహెచ్‌ రంగస్వామి తమ బృందంతో వలపన్నారు. గురువారం సైఫాబాద్‌లో దీపక్‌, జుగల్‌లను అరెస్టు చేశారు. ఉబెకిస్థాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరికి విముక్తి కల్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X