విదేశీ వనితలతో వ్యభిచారం గుట్టు రట్టు
కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన దీపక్ గుప్తా, జుగల్ సాయంతో నగరంలో వ్యభిచార కార్యకలాపాలు సాగించే వాడు. అమిత్ ఇంటర్నెట్లోని ఓ వెబ్సైట్తో పాటు పత్రికల్లోనూ వివిధ రకాలుగా ఫోన్ నెంబర్లతో కూడిన ప్రకటనలు ఇచ్చే వాడు. ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించిన వారి వివరాలను దీపక్, జుగల్కు అందించే వాడు. వీరు ఆ విటుల వద్దకు వెళ్లి ఒక్కొక్కరితో రూ.20 వేల నుంచి రూ.30 వేలకు బేరం కుదుర్చుకునే వారు. ఈ విధంగా రోజుకు ప్రతి సెక్స్వర్కర్ వద్దకు కనీసం ఇద్దరు విటులను తీసుకువచ్చేవారు.
ఆపై లాడ్జిలు, హోటళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగేవి. విటుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఆన్లైన్ అకౌంట్ ద్వారా అమిత్కు పంపేవారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ మద్దిపాటి శ్రీనివాసరావు, ఎస్సైలు బి.నవీన్ రెడ్డి, కె.శ్రీనివాస్, ఎన్సీహెచ్ రంగస్వామి తమ బృందంతో వలపన్నారు. గురువారం సైఫాబాద్లో దీపక్, జుగల్లను అరెస్టు చేశారు. ఉబెకిస్థాన్కు చెందిన యువతితో పాటు ఇద్దరికి విముక్తి కల్పించారు.