హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేం అలా చేయడం లేదు: పొన్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడిని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఖండించారు. తమ పార్టీకి చెందినవారు కూడా నిరసనలు ఎదుర్కుంటున్నారని, తాము తెలంగాణ ఆందోళనకారుల పట్ల అలా వ్యవహరించడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిరసన తెలిపిన న్యాయవాదులపై దాడికి దిగడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. తెలంగాణను సాధించుకుందామని, శ్రీకృష్ణ కమిటీకి తమ అభిప్రాయాలు వినిపించడం ద్వారా తెలంగాణ సాధించుకుని వస్తామని తాము చెబుతున్నామని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయ సాధన అవసరమనే ప్రధాని మన్మోహన్ ప్రకటనపై అపోహలు కల్పించడం సరైంది కాదని ఆయన అన్నారు.

న్యాయవాదులపై దాడికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని కాంగ్రెసు శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఖరి చెప్పాలని డిమాండ్ చేసిన పాపానికి తెలంగాణ న్యాయవాదులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారని, ఇది సరైన చర్య కాదని ఆయన అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ విషయంలో తామెలా వ్యవహరించాలో నిర్ణయించుకుంటామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X