తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థులకు ఉద్యమాలు వద్దు: గవర్నర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narasimhan
తిరుపతి: విద్యార్థులు చదువులపై శ్రద్ధ పెట్టాలని, ఆందోళనల్లో పాల్గొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సూచించారు. ఎస్వీ విశ్వవిద్యాలయం 50వ స్నాతకోత్సవం శ్రీనివాస ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. విద్యావిధానంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై సమీక్ష జరపాలని ఆయన అన్నారు. సాంకేతికాభివృద్ధికి, విశ్వవిద్యాలయాలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని ఆయన సూచించారు.

అన్నమయ్య ఆడియో సీడీని గవర్నర్ ఆవిష్కరించారు. తిరుమలలో జరిగిన పద కవితా పితామహుడు అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమంలో నరసింహన్ పాల్గొన్నారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఈ కార్యక్రమం జరిగింది. అన్నమయ్య కళాకారులు ఆలపించిన సంకీర్తనల ఆడియో సీడీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X