హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నగర ప్రజల అభిప్రాయం వినాలి: దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Danam Nagendar
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో నగర ప్రజల అభిప్రాయాలను కూడా వినాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తాము గ్రేటర్ హైదరాబాదుకు కట్టుబడి ఉన్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే చివరకు తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. బూర్గుల రామకృష్ణరావు తొలి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం ఉండేదని, అయితే గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిన తర్వాత అభిప్రాయాలు పలు రకాలుగా వస్తున్నాయని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తమ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి తాము ప్రత్యేకంగా నివేదిక ఇచ్చే విషయాన్ని ఆలోచించలేదని ఆయన చెప్పారు.

కాగా, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చే నివేదికపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఇప్పటికే కసరత్తు చేశారు. నిపుణులు, మేధావులతో చర్చించిన వారు నివేదికను రూపొందించారు. దానిపై పార్టీ శాసనసభ్యులు, మంత్రులు, మంత్రుల సంతకాలు కూడా సేకరిస్తున్నారు. ఆ నివేదికపై సంతకాలు చేయడానికి ముగ్గురు శాసనసభ్యులు, ముగ్గురు మంత్రులు సంతకాలు చేయలేదు. మంత్రులు దానం నాగేందర్, ముఖేష్, రాజనర్సింహ దానిపై సంతకాలు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. సంతకాలు చేయడానికి నిరాకరించిన శాసనసభ్యుల్లో విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X