నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం జిల్లా: ప్రమాదంలో 4 గురు మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasham Dist.
ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు వద్ద ఆటోను బస్సును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిదిమందిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇలా ఉండగా రోడ్డు ప్రమాదాలపై విచారణకు తగినంత మంది పోలీసు సిబ్బంది జిల్లాలో లేరు.

జిల్లాలో నేరాల నియంత్రణ కోసం ప్రత్యే క విభాగాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీసుశాఖ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. చివరకు మోడల్‌ పోలీసుస్టేషన్ల ఏర్పాటు, త్రీటౌన్‌ పోలీ సుస్టేషన్‌ ప్రతిపాదనలు కూడా బుట్టదాఖల య్యాయి. గుంటూరు రేంజి పరిధిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. గుంటూరు, నెల్లూరు పట్టణాల్లో ఉన్న అన్ని పోలీసుస్టేషన్లలో లా అండ్‌ ఆర్డర్‌ ఎస్సైతోపాటు ప్రత్యేకంగా క్రైం ఎస్సైలు కూడా ఉన్నారు. క్రైం ఎస్సైకి లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించి ఎటువంటి డ్యూటీలు ఉండవు. కేవలం దొంగల పాలైన ఆస్తిని రికవరీ చేయడమే అతని విధి. ఈయన కింద పనిచేసేందుకు దొంగతనాలపై అవగాహన ఉన్న కానిస్టేబుళ్లను నియమిస్తారు. వీరు కనీసం బందోబస్తుకు కూడా వెళ్లరు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X