హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ స్కీమ్స్ కొనసాగుతాయి: డిఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. అమలులో ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని, వేటినీ రద్దు చేసేది లేదని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను ప్రణాళికా సంఘం తప్పు పట్టిన నేపథ్యంలో ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన చెప్పారు. పథకాల అమలులో లొసుగులు, పొరపాట్లు ఉంటే ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని ఆయన అన్నారు.

రోశయ్య ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అందుకు అవసరమైన వనరులను సమీకరించుకుంటుందని ఆయన చెప్పారు. ప్రణాళికా సంఘం చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి తాను పార్టీపరంగానే నివేదిక సమర్పిస్తుందని, పార్టీ విధానానికి అనుగుణంగానే తన నివేదిక ఉంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X