అల్లర్లపై వదంతులు నమ్మొద్దు: సబిత

144 సెక్షన్ అమలులో ఉన్న చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పోలీసు బలగాలతో పాటు పారా మిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దింపినట్లు అమె తెలిపారు. అల్లర్లకు సంబంధించిన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రేపు జరిగే హనుమాన్ జయంతి ర్యాలీకి అందరూ సహకరించాలని ఆమె కోరారు. పాతబస్తీలో కరెంట్, మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆమె మునిసిపల్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications