ఎస్ ఐ ని తిప్పలు పెట్టి తప్పించుకున్న రౌడీ

ఈసంఘటన బుధవారం రాత్రి అనంతపురం నగరంలోని రాజా, రమణ థియేటర్ల కూడళిలో చోటు చేసుకుంది. కొన్ని వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మున్నానగర్ కు చెందిన రౌడీషీటర్ రమేష్, అతని అనుచరులు రాజా, రమణ థియేటర్ల కూడళిలో ఉన్నట్లు వన్ టౌన్ పోలీసులకు సమా చారం అందింది. ఎస్ ఐ రమణ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఈసందర్భంలో రమేష్ ఎస్ఐపై తిర గబడ్డాడు.
ఏం చేశానని అరెస్ట్ చేసేందుకు వచ్చారు? అంటూ తీవ్రస్థాయిలో ఎస్ ఐపై వాగ్వాదానికి దిగాడు. ఇలా దాదాపు పదిహేను నిమిషాల పాటు వారి మధ్య మాటలయుద్దం జరిగింది. తీవ్రత ఎక్కువవుతుండటంతో ఇది పసిగట్టిన ఆరౌడీషీటర్ తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి లగెత్తాడు. ఈహఠాత్పరిణామం నుంచి తేరుకున్న ఎస్ ఐ ఆరౌడీషీటర్ ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
దీంతో చేసేదే మీలేక రౌడీషీటర్ తోపాటు అతని అనుచరులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈపరిణా మాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణించినట్లు సమాచారం.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications