హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Stock Market
హైదరాబాద్‌: ఇన్వెస్టర్లు మరీ అంత కంగారు పడని స్ధాయిలో భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కొనసాగాయి. భారత స్టాక్‌ మార్కెట్లలో ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 17831 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17488 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. కనిష్టస్థాయి నుండి కోలుకొని 18047 ఇంట్రాడే గరిష్టస్థాయిని చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 40 పాయింట్ల పతనంతో 17812 వద్ద నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 5323 వద్ద కొనసాగుతున్నాయి.

ఇన్ఫోసిస్‌ 4శాతం లాభపడగా, హెచ్‌ సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో, ఆర్ ‌పవర్‌, భెల్‌, బీపీసీఎల్‌, టాటాస్టీల్‌, పీఎన్‌ బీ, రిలయన్స్ ‌ఫ్రా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఐడీఎఫ్‌ సీ, హీరోహోండా, కెయిర్న్‌, ఆర్‌ కామ్‌, సెయిల్‌, హెచ్‌ డీఎఫ్‌ సీ, స్టెర్‌, ఐసీఐసీఐబ్యాంక్‌, ఎం అండ్‌ ఎం, యాక్సీస్‌బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X