జగన్ యాత్రపై ప్రభుత్వమే చెప్పాలి: డిఎస్

Srinivas
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఉందో లేదో ప్రభుత్వమే చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జగన్ చేపట్టిన యాత్ర ఆయన వ్యక్తిగతమని శ్రీనివాస్ బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ యాత్రకు ఎవరి అనుమతి కూడా అవసరం లేదని ఆయన అన్నారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున ఎఐసిసియే నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాను నివేదిక సమర్పిస్తే అపోహలకు దారి తేసే అవకాశం ఉందని, అందువల్ల ఎఐసిసియే నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాలేదని ఆయన అన్నారు. జాబితాను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తుందని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరుగుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+