విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి రాయబారాలపై దేవినేని నిప్పులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
విజయవాడ: రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మీద తెలుగుదేశం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాలపై పార్టీ విధేయులు, లాబీయిస్ట్‌ లు పట్టు సాధిస్తున్నారని, కేంద్రంలో విదేశాంగశాఖ మాజీ సహాయమంత్రి శశి థరూర్‌, టెలీకమ్యూనికేషన్స్‌ మంత్రి ఎ రాజా వ్యవహారాలతో ఇది రుజువైందని తెలుగుదేశం పార్టీ నేత, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

రెండు వేర్వేరు వ్యవహారాల్లో సునందా పుష్కర్‌, నీరా రాడియాల జోక్యంపై మీడియాలో వచ్చిన కథనాలను బట్టి కేంద్ర ప్రభుత్వ విధానాల్లో దళారుల పాత్ర రుజువైందని శనివారం ఇక్కడ పాత్రికేయులతో మాట్లాడిన ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఆరేళ్ల కాంగ్రెసు పార్టీ పాలన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలోను, ప్రస్తుత ముఖ్యమంత్రి కె రోశయ్య హయాంలోను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నిర్దేశకాల మేరకే జరుగుతున్నదని అన్నారు.

రామచంద్రరావు సూచనల కింద రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాజా, శశిథరూర్ ‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. హైకోర్ట్‌ ప్రస్తుత న్యాయమూర్తితో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఉమామహేశ్వరరావు కోరారు.

స్పెక్ట్రమ్‌ కేటాయింపులో అవినీతికి సంబంధించి పలు ఆరోపణలను మీడియాలో ప్రస్తావిస్తున్నప్పటికీ యుపిఎ ఛైర్‌పర్శన్‌ సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మౌనంగా ఉండటంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం కుప్పకూలకుండా కాపాడుకునేందుకే కాంగ్రెసు పార్టీ మౌనంగా ఉందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X