వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యవాదులు ఆపలేరు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటన తర్వాత సమైక్యవాదులు అనవసరంగా మాట్లాడుతున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోనే ఉందని చిదంబరం చేసిన ప్రకటన కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టేదిగా ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వంపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తాము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటామని ఆయన అన్నారు. నాలుగు కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తెచ్చుకుంటారని, ఐదుగురు సమైక్యవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీల మెడలు వంచుతామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X