వైయస్ జగన్ ను ప్రశ్నిస్తాం: బొత్స

ప్రభుత్వ పథకాలు సక్రమంగానే అమలవుతు న్నాయని, ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. పాలనా వ్యవహారాల్లో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు జోక్యం అధికంగా ఉంటోందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మండిపడ్డారు. పాలనా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే తప్ప ముందుకు నడవలేని స్థితిలో రోశయ్య లేరన్నారు. 'ముఖ్యమంత్రి చిన్న పిల్లాడేమీ కాదు. ఆయన ఈరోజే అధికారాన్ని చేపట్టలేదు. కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. ఆర్థిక మంత్రిగా ఆయన ఎంతో అనుభవం ఉన్న నేత. ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా.. మంత్రుల కమిటీవేసి అధ్యయనం చేయాలంటే చైర్మన్గా రోశయ్య పేరే వినిపిస్తుంది. అంతటి అనుభవం ఆయనది' అన్నారు.












Click it and Unblock the Notifications