నాయకత్వం చంద్రబాబుదే: బాలకృష్ణ
'సింహా' చిత్రం విజయాన్ని పురస్కరించుకొని నారసింహ క్షేత్రాలను సందర్శిస్తున్న ఆయన బుధవారం కృష్ణా జిల్లా వేదాద్రి దేవస్థానాన్ని, గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన తండ్రి ఆశయాలతో కొనసాగే పార్టీ విజయానికి కృషిచేసే ప్రతి కార్యకర్తా వారసుడేనని వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలు ఎప్పుడు చేపడతారని మీడియా ప్రతినిధులు అడిగితే''తొందరేముంది, ఇప్పుడు ఆ అవసరమేముంది'' అని ప్రశ్నించారు. "నాకోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి" అన్నారు.
Comments
Story first published: Thursday, May 13, 2010, 7:58 [IST]