హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయ లబ్ధికే చిరు యాత్ర: కవిత

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోలవరం కోసం యాత్ర చేపట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును ఆపేయాలని కోరుతూ ఆమె గురువారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలవరం కోసం చిరంజీవి బస్సు యాత్ర చేపట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని 296 గ్రామాలు ముంపునకు గురవుతాయని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తే సహించేది లేదని, పోలవరం ప్రాజెక్టును ముట్టడిస్తామని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అబద్ధాలు చెబుతున్నారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X