హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పథకాలు కొనసాగిస్తాం: మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగించడమే తమ ధ్యేయమని మంత్రులు మాణిక్యవర ప్రసాద్, ముఖేష్ గౌడ్ అన్నారు. కార్పొరేట్ విద్యా విధానంపై జారీ చేసిన 162 జీవోపై ముఖ్యమంత్రి రోశయ్య గురువారం సమీక్షించారు. సమీక్ష అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ విద్యా విధానంపై జారీ చేసిన జీవోపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు వారు తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు ఫీజు రీయంబర్స్ మెంటు కొనసాగించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఈ మేరకు జీవో జారీ అవుతుందని వారు చెప్పారు.

కార్పొరేట్ విద్యాను మరింత మంది పేదలకు అందిస్తామని మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లింపులపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ముఖేష్ గౌడ్ చెప్పారు. రీయంబర్స్ మెంట్ జీవో జారీ అయిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X