వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సుపై కరెంట్ తీగలు పడి 35 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhya Pradesh
భోపాల్: మధ్యప్రదేశ్ లో శుక్రవారం జరిగిన ఓ ప్రమాదంలో 35 మంది మరణించారు. మండాల నుంచి పిందారి వెళ్తున్న బస్సుపై బిన్వాసి ప్రాంతంలో హైటైన్షన్ విద్యత్తు వైర్లు తెగి పడడంతో 35 మంది ప్రయాణికులు మరణించినట్లు సమాచారం. మరో 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించినప్పుడు బస్సులో 55 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభానికి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. వీరంతా ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడినవారిని మండ్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X