ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామ్ చరణ్ పెట్టుబడులు అబద్ధం: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఏలూరు: తన కుమారుడు రామచరణ్ ఐపియల్ లో పెట్టుబడులు పెట్టినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలు తనకు మానసిక సంక్షోభానికి గురి చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని ఆయన సూచించారు. తాను గాంధేయవాదిని అని, అయితే రైతులు గాంధేయవాదులు కారని ఆయన అన్నారు. తనకు సొంతంగా చానెల్ పెట్టే ఆలోచన లేదని ఆయన చెప్పారు. వడదెబ్బతో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలకు మూడు లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లేవని తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న ప్రకటనలు అబద్ధాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనమతులున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలవరంపై తెరాస చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 21వ తేదీన పోలవరంలో జరగాల్సిన సభ వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ముందుగా ఖమ్మం జిల్లాలో నిర్వాసిత ప్రాంతాలను పర్యటించునున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X