రామ్ చరణ్ పెట్టుబడులు అబద్ధం: చిరు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లేవని తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న ప్రకటనలు అబద్ధాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనమతులున్నాయని ఆయన స్పష్టం చేశారు. పోలవరంపై తెరాస చేస్తున్న విమర్శల్లో నిజం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ నెల 21వ తేదీన పోలవరంలో జరగాల్సిన సభ వాయిదా పడినట్లు ఆయన తెలిపారు. ముందుగా ఖమ్మం జిల్లాలో నిర్వాసిత ప్రాంతాలను పర్యటించునున్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Friday, May 14, 2010, 14:08 [IST]