హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబును చూస్తే జాలేస్తోంది: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తోందని ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఏం మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబుకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బావ మరిది బాలకృష్ణ మాటలతో చంద్రబాబుకు మతి భ్రమించిందని, పరిస్థితి చూస్తుంటే చంద్రబాబుపై జాలి వేస్తోందని ఆయన అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

బావ మరిది బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకుని తానే ముఖ్యమంత్రిగా కొనసాగాలని చంద్రబాబు కుట్ర చేశారని ఆయన అన్నారు. చంద్రబాబును తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని, చంద్రబాబు మాత్రం అదే పనిలో ఉన్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సంక్షేమ పథకాల ఫలితాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందాలనేది తమ ఉద్దేశమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X