జగన్ వ్యాఖ్యలపై రోశయ్య ఉక్కిరి బిక్కిరి
పావలా వడ్డీ అంశం అనుకుంటేనే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని జగన్ వ్యాఖ్యానించినప్పుడు మీరేం చేస్తున్నారని ఘాటుగా మాట్లాడినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా వాస్తవ పరిస్థితులను ఎందుకు చెప్పలేక పోయావని నిలదీసినట్లు తెలిసింది. పావలా వడ్డీ పథకానికి నిధులు కొరత ఇప్పడు తలెత్తింది కాదు, ఎప్పటి నుంచి నిధుల రాక నెమ్మదించాయన్న అంశాన్ని వివరించి ఉండాల్సిందని రోశయ్య అన్నట్లు సమాచారం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే పావలా వడ్డీ పథకానికి నిధుల కటకట ఉండేదంటూ రోశయ్య కడప జిల్లాకు చెందిన నేతలతో అన్నట్లు తెలిసింది.
Comments
Story first published: Friday, May 14, 2010, 9:19 [IST]