కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వ్యాఖ్యలపై రోశయ్య ఉక్కిరి బిక్కిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
కడప: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన వ్యాఖ్యలకు సమాధానం చెప్పేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం ఆయనను మరింత ఇబ్బందుల పాలు చేస్తోంది. మంత్రులు గానీ అధికారులు గానీ జగన్ వ్యాఖ్యలకు దీటైన జవాబు చెప్పడానికి సిద్ధంగా లేరు. మహిళా సమాఖ్యలకు పావలా వడ్డీ పథకం అమలు తీరుపై జమ్మలమడుగు ప్రజాపథంలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు రోశయ్యకు కష్టాలు తెచ్చి పెట్టాయి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రోశయ్య తీవ్రంగా పరిగణిస్తున్నారు. జిల్లా కలెక్టరు శశిభూషణ్‌కుమార్‌ ప్రజాపథంలో ఉన్నా సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుబడుతూ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఈ మేరకు ఓ వార్తాకథనం ప్రచురితమైంది.

పావలా వడ్డీ అంశం అనుకుంటేనే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందని జగన్‌ వ్యాఖ్యానించినప్పుడు మీరేం చేస్తున్నారని ఘాటుగా మాట్లాడినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతినిధిగా వాస్తవ పరిస్థితులను ఎందుకు చెప్పలేక పోయావని నిలదీసినట్లు తెలిసింది. పావలా వడ్డీ పథకానికి నిధులు కొరత ఇప్పడు తలెత్తింది కాదు, ఎప్పటి నుంచి నిధుల రాక నెమ్మదించాయన్న అంశాన్ని వివరించి ఉండాల్సిందని రోశయ్య అన్నట్లు సమాచారం. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడే పావలా వడ్డీ పథకానికి నిధుల కటకట ఉండేదంటూ రోశయ్య కడప జిల్లాకు చెందిన నేతలతో అన్నట్లు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X