హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపికి ప్రపంచస్థాయి గుర్తింపు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఆర్థిక మాంద్యంలోనూ ఆంధ్రప్రదేశ్ సాధించిన ఆర్థికాభివృద్ధి ప్రపంచంలో మనకో గుర్తింపును తెచ్చిపెట్టిందని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. సంస్కరణల అమలులో కూడా మన రాష్ట్రం ప్రపంచ బ్యాంకు గుర్తింపు పొందిందని ఆయన అన్నారు. హైటెక్స్ లో శుక్రవారం ఆయన ఆటోషో 2010ని ఆయన ప్రారంభించారు. ఈ ఆటో షో మూడు రోజులపాటు జరుగుతాయి. ఇన్వెస్టర్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలా వచ్చినవారికి అన్ని విధాలా సహకరించి, తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రోశయ్య పేర్కొన్నారు.

ఇంతవరకు దేశ రాజధాని న్యూఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆటోషో హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. ఢిల్లీ వెలుపల జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి ప్రాంతీయ ఆటో షో ఇది. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ, భారత ఆటోమొబైల్ ఉత్పత్తిదారుల సంఘం (సియామ్), ఆటోమొబైల్ విడిభాగాల ఉత్పత్తిదారుల సంఘం (ఆక్మా), భారత ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాదా) సహకారంతో ఈ ఆటోషో నిర్వహిస్తోంది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, స్కోడా, ఫియట్ ఇండియా లిమిటెడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, యమహా వంటి జాతీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ ఉత్పత్తిదారులతో పాటు ఆటో విడిభాగాల ఉత్పత్తిదారులు ఈ ఆటోషోలో పాల్గొంటున్నారు. ఇరవైకి పైగా కంపెనీలు పాల్గొంటున్న ఈ ఆటోషోలో దేశంలోనే అతి పెద్ద కార్ల ఉత్పత్తి కంపెనీ మారుతి సుజుకీ, టూ వీలర్ కంపెనీ బజాజ్ ఇండియా పాల్గొనకపోవడం లోటుగానే చెప్పాలి. స్కోడా కంపెనీ ఇటీవల తాము మార్కెట్లో విడుదల చేసిన సూపర్బ్ 1.8 మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కారును మహావీర్ ఆటో స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X