హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసకు ఆ హక్కు లేదు: దేవేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్: తెలంగాణలో ఇతర పార్టీల నాయకులను అడ్డుకునే హక్కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి లేదని మాజీ హోం మంత్రి, తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రజా సమస్యలపై పర్యటిస్తున్న నాయకులను తెరాస అడ్డుకోవడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిదుల సమావేశంలో అన్నారు. ఎల్బీ స్టేడయంలో కాంగ్రెసు పార్టీ పునరంకిత సభ నిర్వహించడం క్రీడాకారులను అవమానించడమేనని, వేదికను కాంగ్రెసు మార్చుకోవాలని ఆయన అన్నారు.

హైదరాబాదులో పోలీసులకే రక్షణ లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రమేష్ అనే పోలీసు కానిస్టేబుల్ హత్యకు దారి తీసిన సంఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన విమర్శించారు. భద్రత కోసం ఉన్న పోలీసుల వద్ద ఆయుధాలు కూడా లేవని ఆయన అన్నారు. ప్రజా భద్రతా కమిటీ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తాము త్వరలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X