వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు ఇంజినీర్ అనుమానాస్పద మృతి

By Santaram
|
Google Oneindia TeluguNews

Telugu Software Engineer Died
ఎల్లారెడ్డిపేట: అమెరికాలో ఓ యువ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాచర్ల గొల్లపల్లికి చెందిన పొన్నాల లక్ష్మారెడ్డి తనయుడు కిరణ్‌కుమార్‌ రెడ్డి(32) గత మూడేళ్ల నుంచి అమెరికాలో సాప్ట్ వేర్ ఇంజనీర్‌ గా స్థిరపడగా శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం అందింది. గొల్లపల్లికి చెందిన లక్ష్మారెడ్డి ఉద్యోగ రీత్యా గత 35ఏళ్ల క్రితం హైదరాబాద్‌ కు వెళ్లాడు. సికింద్రాబాద్‌ లోని ఎపి ట్రాన్స్‌కో విభాగంలో ఎస్ ఇగా పని చేస్తూ ఇటీవలే రిటైర్ అయ్యాడు. అతనికి జీవన్‌ కుమార్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, కూతురు జ్యోతి ఉండగా ఈ ముగ్గురు గత కొంతకాలం నుంచి అమెరికాలో ఉంటున్నారు.

కిరణ్‌ కుమార్‌ రెడ్డి వివాహం గత ఏడాదిన్నర క్రితం జరిగింది. అమెరికాలో ఉన్న కిరణ్‌ కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం అందడంతో గొల్లపల్లిలోని అతని బంధు వుల ఇళ్ళల్లో ఆందోళన నెలకొంది. మృతుడి మెడ భాగంపై కోసినట్టు గాయాలు ఉన్నట్లు తెలియడంతో అతని మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X