గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిశ మార్చుకున్న లైలా తుఫాను

By Pratap
|
Google Oneindia TeluguNews

Cyclone Laila
గుంటూరు‌: బంగాళాఖాతంలో ఏర్పడిన లైలా తుఫాను దిశ మార్చుకుంది. దీంతో ఒంగోలు, బాపట్ల మధ్య శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా బాపట్లకు 50 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఒంగోలు పట్టణం నీట మునిగింది. గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సముద్రంలో అలలు మీటరు నుంచి ఐదు మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. తుఫాను తీరాన్ని తాకే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తుఫాను క్రమంగా బలహీనపడుతున్నట్లు చెబుతున్నప్పటికీ దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావం పడే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X