చిరంజీవికి భ్రమలు తొలిగి, భ్రాంతి మిగిలింది: హరికృష్ణ
ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశ చెంది చిరంజీవి కాంగ్రెసుతో చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అవినీతిలో భాగస్వామి కాదలుచుకున్నావా అని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న చిరంజీవి ఏ ప్రజల కోసం కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడ్డారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేసి సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడి సీమాంధ్ర ప్రజల ఆశలను కూడా నీరుగార్చారని ఆయన చిరంజీవిపై విరుచుకుపడ్డారు.
Comments
హరికృష్ణ తెలుగుదేశం చిరంజీవి ప్రజారాజ్యం హైదరాబాద్ harikrishna telugudesam chiranjeevi prajarajyam hyderabad
Story first published: Friday, June 11, 2010, 16:37 [IST]