చిరంజీవికి భ్రమలు తొలిగి, భ్రాంతి మిగిలింది: హరికృష్ణ

Harikrishna
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం ఆ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెసుతో ఫ్రెండ్ షిప్ సంగతి తేల్చాలని ఆయన చిరంజీవిని డిమాండ్ చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అవుతుందో, పొత్తు పెట్టుకుందో ప్రజలకు చెప్పాలని ఆయన చిరంజీవిని డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామని చెప్పి నమ్మించి ఇప్పుడు కాంగ్రెసుతో చేతులు కలిపి ప్రజలను చిరంజీవి మోసం చేశారని ఆయన విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనమవుతుందని చేసిన వ్యాఖ్యను వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు చిరంజీవి రాసిన లేఖకు సమాధానంగా హరికృష్ణ ఈ బహిరంగ లేఖ రాశారు. చిరంజీవికి భ్రమలు తొలిగాయి, భ్రాంతి మిగిలిందని హరికృష్ణ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో నిరాశ చెంది చిరంజీవి కాంగ్రెసుతో చేతులు కలిపారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అవినీతిలో భాగస్వామి కాదలుచుకున్నావా అని ఆయన చిరంజీవిని ప్రశ్నించారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న చిరంజీవి ఏ ప్రజల కోసం కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడ్డారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఆయన అన్నారు. సామాజిక తెలంగాణ సాధిస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలను మోసం చేసి సమైక్యాంధ్ర నినాదం తీసుకున్నారని, ఇప్పుడు కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడి సీమాంధ్ర ప్రజల ఆశలను కూడా నీరుగార్చారని ఆయన చిరంజీవిపై విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+