విభజనపై జెపి వైఖరి: కర్ర విరగలేదు, పాము చావలేదు

Jayaprakash Narayana
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వైఖరి కర్ర విరగలేదు, పాము చావలేదు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల ముందు ఆయన బుధవారం తన వాదన వినిపించారు. ఇందులో రాష్ట్ర విభజన జరగాలని గానీ వద్దని గానీ ఆయన చెప్పలేదు. రాష్ట్రం రాకపోతే ఉపద్రవం రాదు, వస్తే నష్టమూ లేదని ఆయన ఎటూ కాకుండా చెప్పేశారు. దీంతో 'ఇప్పటి వరకు మమ్మల్ని కలిసినవారు తెలంగాణ ఏర్పాటు అవసరమనో, అవసరం లేదనో చెప్పారు. మీరు రెండూ చెప్పలేదు. దీనిపై మీ విధానం ఏమిటి?' అని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అడిగారు.

సమస్య ఎందుకు ఏర్పడింది? దానికి పరిష్కారాలేమిటి? అని తెలియజెబుతూ జేపీ 45 నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అదంతా విన్న తర్వాత కమిటీ సభ్యులు జేపీని ఈ ప్రశ్న అడిగారు. దానికి జేపీ బదులిస్తూ దేశ సమగ్రత, రాష్ట్ర ప్రయోజనాలు, సామరస్యతను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యమేనని చెప్పారు. అధికార వికేంద్రీకరణ చేయాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14(ఎఫ్)ను రద్దు చేయాలని, నదీ జల వివాదాల పరిష్కారం కోసం చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+