హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ యాత్రపై రోశయ్య బెదిరింపులు సరి కాదు: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని ప్రజాప్రతినిధులకు సూచించిన ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని రోశయ్య బెదిరించడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వైయస్ హఠాన్మరణంతో ముఖ్యమంత్రి పీఠం దక్కిందనే విషయాన్ని రోశయ్య గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

వైయస్ సంవత్సరీకం జరగక ముందే రోశయ్య వైభవంగా పుట్టిన రోజు జరుపుకోవడం ఏ రకంగా సమంజసమని ఆయన ప్రశ్నించారు. అధిష్టానవర్గానికి చెప్పి జగన్ ఓదార్పు యాత్రకు అనుమతి ఇప్పించాలని ఆయన రోశయ్యను కోరారు. జగన్ ఓదార్పు యాత్ర క్రమశిక్షణా రాహిత్యం కాదని ఆయన అన్నారు. లక్షలాది మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకుంటారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X