బాబ్లీని ఆపించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులను ఆపించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడ్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శానససభ సమావేశాల సందర్భంగా బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గన్ పార్కు వద్ద బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెసు విఫలమైందని ఆయన విమర్శించారు. మహారాష్ట్రలోనూ ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని, అయినా మహారాష్ట్ర నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అపించడానికి కాంగ్రెసు ప్రయత్నించడం లేదని ఆయన అన్నారు.

బాబ్లీ ప్రాజెక్టును ఆపే వరకు తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మాటలు చెప్తే సరిపోదని, ప్రాజెక్టును అపించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. బాబ్లీపై తక్షణ చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సభలో వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఆ తర్వాత శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+