హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐదేళ్లలో జగన్ రాజకీయ జీవితం ముగిసిపోతుంది: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన కుమారుడిలాంటివాడని, జగన్ రాజకీయ జీవితం ఐదేళ్లలో ముగిసిపోకూడదని తాను కోరుకుంటున్నానని కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ ఓదార్పు యాత్రను వాయిదా వేయడం మంచిదని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థంతోనే జగన్ ఓదార్పు యాత్రను చేపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బాధితులకు సహాయం చేయాలంటే ఒక చోటికి పిలిపించి చేయవచ్చునని, అనంతపురానికి పిలిపించి తమ పార్టీ అధ్యక్షురాలు గతంలో రైతు కుటుంబాలకు సాయం చేశారని, సోనియా యాత్ర చేసి ఆర్థిక సాయం అందించి ఉంటే బోలెడు ప్రచారం వచ్చేదని, కానీ అలా చేయలేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు ఏమైనా ఫరవా లేదు, ఎన్ని గ్రూపులైనా ఫరవా లేదనే పద్ధతిలో జగన్ వ్యవహరిస్తున్నారని, తనకు పార్టీ అధిష్టానం భయపడుతుందనీ తనను ఏమీ చేయదనీ అనుకుంటున్నారని, అలా అనుకుంటే పొరపాటేనని ఆయన అన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పార్టీ అధిష్టానం సహించదని, ఇంతకు ముందు సహించలేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రలు ఎప్పుడూ ఉండవని, వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్ని కార్యక్రమాలు చేశాడో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఈ రోజు వేడి రేపు ఉండదని, ఈ రోజు వేడి చూసుకుని శాసనసభ్యులు, కార్యకర్తలు తన వెంట ఉన్నారని జగన్ అనుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. సైకోఫాన్స్, అసాంఘిక శక్తులు చూపిన దారిలో జగన్ నడుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X