వైయస్ జగన్ యాత్రపై కుండ బద్దలు కొట్టిన రోశయ్య

Rosaiah
హైదరాబాద్: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై ముఖ్యమంత్రి కె. రోశయ్య కుండ బద్దలు కొట్టారు. ఓదార్పు యాత్రకు పార్టీ అధిష్ఠానం అనుమతి లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఓదార్పు యాత్రలో పాల్గొనాలా, వద్దా అని అడిగిన మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలు వద్దని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాలను గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉందని వారికి తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాలకు భిన్నంగా ఎవరం కూడా వ్యవహరించవద్దని సలహా ఇచ్చానని ఆయన అన్నారు. ఓదార్పుయాత్రకు అధిష్టానం అనుమతి లేదని జగనే స్వయంగా తన బహిరంగ లేఖలో చెప్పారని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ముఖాముఖి జరిగిన సమావేశం వివరాలను బహిర్గతం చేయడం సరి కాదని, అయినా జగన్ బయట పెట్టారని ఆయన అన్నారు.

జగన్ ఓదార్పు యాత్రను ఆపితే మంచిదని ఆయన అన్నారు. అడగకుండా ఆయాచితంగా సలహా ఇచ్చే అలవాటు తనకు లేదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్రపై మేడమ్ సోనియా గాంధీ తనతో మాట్లాడలేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తనతో మాట్లాడారని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర రాష్ట్ర రాజకీయాలపై ఏ విధమైన ప్రభావం చూపదని ఆయన అన్నారు. పార్టీలో ఏ విధమైన అనిశ్చితి నెలకొనబోదని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జగన్ తన అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు. తన అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+