హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధిక్కారానికే మొగ్గు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరిన జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించడానికే ఆయన పూనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి గురువారం నుంచి ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషనుకు చేరుకున్నారు. ఆయన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి ఇచ్చాపురం చేరుకుంటారు.

జగన్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు. నినాదాలతో రైల్వే స్టేషనులో సందడి నెలకొంది. తల్లి విజయలక్ష్మి ఆశీస్సులు తీసుకుని జగన్ ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కోరారు. జగన్ ఓదార్పు యాత్ర రాజకీయ యాత్ర కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X