హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ సెంటిమెంటు బలంగా పని చేసింది: డి శ్రీనివాస్

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: తెలంగాణ ఉప ఎన్నికల్లో సెంటిమెంటు బలంగా పని చేసిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో ముక్తసరిగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కూడా ఆయన పెద్దగా ఇష్టపడలేదు. కొద్దిసేపు మాత్రమే మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఆయన అన్నారు.

తెలంగాణ కాంగ్రెసు తన నిబద్ధతను ప్రకటించినా డిసెంబర్ 9వ తేదీ తర్వాత పరిణామాలు మారిపోయాయని ఆయన అన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేశారనే భావనతో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఓటేశారని ఆయన అన్నారు. తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X