హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు ఖతం: మాజీ మంత్రి సంతోష్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana map
హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఇవ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అవుతుందని మాజీమంత్రి సంతోష్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, ఈ తీర్పు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు కనువిప్పు కావాలని అన్నారు. ఉప ఎన్నికల ఓటమికి నైతికబాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రాజీనామా చేయాలని సంతోష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

తెలుగుదేశం, కాంగ్రెస్‌ అధ్యక్షులు చంద్రబాబు, డీఎస్‌లు వెంటనే శ్రీకృష్ణ కమిటీ ముందుకు వెళ్లి తెలంగాణ అనుకూల వాదన వినిపిప్తేనేప్రజలు క్షమిస్తారని అన్నారు. సంతోష్‌రెడ్డి మాట్లాడుతుండగా సీఎల్పీ కార్యాలయంలో విద్యుత్‌ ప్రసారాన్ని నిలిపివేయటంతో సంతోష్‌రెడ్డి మధ్యలోనే మీడియా సమావేశాన్ని ముగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X