వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానంతో వైయస్ జగన్ సయోధ్య సాధ్యమయ్యేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ఫలించేట్లు కనిపించడం లేదు. అయితే, సయోధ్యకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాత్రం ఆశావహ దృక్పథంతో ఉన్నారు. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. కొండా సురేఖకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో సబ్బం హరి రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైయస్ జగన్ తో ఆయన సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. జగన్ అధిష్టానం మాట వినాలనే ఉద్దేశంతో ఉన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియమిత్రుడు కెవిపి రామచందర్ రావు కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ వర్గం మాత్రం అందుకు సిద్ధంగా లేరు.

అధిష్టానంతో జగన్ కు సయోధ్య కుదర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలించే విధంగా లేవు. అటు సయోధ్య ప్రయత్నాలు జరుగుతుండగానే ఇటు హైదరాబాదులో జగన్ ముఖ్య అనుచరుడు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి రోశయ్యపై, అధిష్టానంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సురేఖ లేఖతో గానీ అంబటి రాంబాబు విమర్శలతో గానీ తనకు సంబంధం లేదని జగన్ చెప్పే మాటలను విశ్వసించే పరిస్థితిలో అధిష్టానం లేదు. జగన్ కావాలనే ఓ వైపు రాజీ ప్రయత్నాలు సాగిస్తూ మరో వైపు తన అనుచరులతో దాడి చేయిస్తున్నారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితిలో జగన్ ను అధిష్టానం మునుపటిలా స్వీకరించడానికి సిద్ధంగా లేదు. పైగా, జగన్ ను ఒంటరి చేయాలనే ఎత్తుగడలను అనుసరిస్తూ వస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X