కె చంద్రశేఖర రావు కుటుంబం లబ్ధికోసమే టీఆర్ఎస్: దేవేందర్ గౌడ్

Devender Goud
హైదరాబాద్: తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారంకోసం పోరాటాలు మాని కేవలం తెలుగుదేశంపై దుమ్మెత్తి పోయడమే టీఆర్ఎస్ నాయకులు, చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి నాయకుడు, మాజీమంత్రి దేవేందర్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో చంద్రశేఖర్ రావు తప్ప మిగతా పార్టీవారు తిరగకూడదా అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటే వాటిని అందరి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే దిశలో తమ నాయకుడు చంద్రబాబు రంగారెడ్డి జిల్లాలో వర్యటిస్తే టీఆర్ఎస్ దాన్ని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను టీఆర్ఎస్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజా సమస్యలను అటు ప్రభుత్వం, ఇటు రాజకీయపార్టీలు పట్టించుకోకుంటే ఎలా అన్నారు. దీన్ని అందరూ ఆలోచించాలన్నారు.

ప్రజల కష్టనష్టాలను పక్కనపెట్టి తెలంగాణ ముసుగులో టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందుతుందని విమర్శించారు. తెలంగాణలో వచ్చిన అనేక అభివృద్ధి మార్పులకు కారణం ఇక్కడ కీలకపాత్ర పోషించిన టిడిపిదేనని అందరికీ తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించుకుంటున్న పార్టీ సభలో టీఆర్ఎస్ ఆందోళన నిర్వహించే కుసంస్కారం ఏమిటని ప్రశ్నించారు. పార్టీని భూస్థాపితం చేస్తాం ఆనటం ఎంత వరకు సమంజసమన్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణలో నెలకొన్న బాబ్లీ, బయ్యారం, ఎరువులు, పలు ప్రజా వ్యతిరేక సమస్యలపై స్పందించని టీఆర్ఎస్ సమస్యలపై స్పందించిన తెలుగుదేశంపై దాడులు చేయటం దురదృష్టకరమన్నారు. అయినా ఏ పార్టీ పాలసీలు వారివి, ప్రతి ఒక్కరికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులలోనే వారు నడుచుకుంటారు. వాటిపై స్పందించాల్సింది ప్రజలు. వాటిని ప్రజల విజ్ఞతకు వదిలెయ్యాలని దేవేందర్ గౌడ్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+