కెసిఆర్! నీ నోటిని ఫినాయిల్ తో కడుక్కో: దేవేందర్ గౌడ్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కోట్లు గడించడానికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వ్యూహత్మకంగా కుట్రలు పన్నుతున్నాడని తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు తూళ్ల దేవేందర్ గౌడ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకరుల ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు తెలుగు దేశం పార్టీ వ్యతిరేకం కాదని, దానిని పోరాడి సాధించుకోవాలి కాని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ సంపాదన కోసం ఉద్యమాన్ని ఫణంగా పెట్టడం పద్ధతి కాదన్నారు. కెసిఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదని అక్రమంగా సంపాదనే లక్ష్యంగా ఆయన ఉద్యమాన్ని లేవదీస్తున్నారన్నారు. కెసిఆర్ కుట్ర పూరితంగానే తెలంగాణలో తెలుగు దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ విషయంలో కెసిఆర్ పై తాను గతంలో వ్యాఖ్యానించిన తెలంగాణకు కెసిఆర్ అడ్డంకి అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. ఆ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కెసిఆర్ కేంద్రానికి ఒక అమ్మకపు వస్తువు అని, సమయానుకూలంగా ఆయన రేటు మారుతుందని దుయ్యబట్టారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉండి, తెలంగాణ కోసం అహర్నిషలు పాటుపడుతున్న తెలుగు దేశాన్ని విమర్శించటం ద్వారా కెసిఅర్ తెలంగాణపై తనకున్న చిత్తశుద్ధిని బయట పెడుతుందన్నారు.

కుటుంబ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలు బలిపెట్టుతున్న కెసిఆర్ కుట్ర రాజకీయాలు ప్రజలు తెలుసుకుంటున్నారని, గురువారం సీమాంధ్ర వ్యాపార సీఈవోలతో ఆయన తన లాభం కోసమే సమావేశమయ్యారన్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోలేక అనేక కుతంత్రాలు పన్నుతున్నాడని, పార్టీలోకి ఎవరూ రాక, ఉన్నవారినీ నిలుపుకోలేక వారిని ఆకర్షించి ఉంచటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఆయన చాలా కుతంత్రాలు చేస్తున్నారన్నారు. కెసిఆర్ హీరో అనుకుంటున్నాడని, నోరు ఆదుపులో పెట్టుకోవాలని లేకుంటే తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. నోటిని ఫినాయిల్ తో కడుక్కోవాలని హితవు పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+