వైయస్ జగన్ వర్గీయులకు పిసిసి అధ్యక్షుడు డిఎస్ వార్నింగ్

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం వల్ల షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎఐసిసి నుంచి ఓ జాబితా అందిందని ఆయన చెప్పారు. జిల్లా అధ్యక్షులు, మంత్రులు, ఇంచార్జీ మంత్రులు బాధితుల వివరాలు వారంలోగా తమకు అందిస్తారని, ఆ జాబితాను తిరిగి తాము అధిష్టానానికి పంపుతామని, తుది జాబితాను తయారు చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడి పార్టీ గౌరవాన్ని తగ్గిస్తున్న నాయకులపై తమ పరిధిలో ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటామని, తమ పరిధిలోకి లేకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications