విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషా హత్య కేసుతో నాకు సంబంధం లేదు: కోనేరు సతీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ayesha
విజయవాడ: సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీమంత్రి కోనేరు రంగారావు మనుమడు కోనేరు సతీష్ అన్నాడు. తనపై ఆయేషా తల్లిదండ్రులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపాడు. పోలీసులు నన్ను కూడా ఆదుపులోకి తీసుకొని సత్యంబాబుకు చేసిన అన్ని నార్కొటిక్ అనాలసిస్ పరీక్షలను నాకు చేసారని సతీష్ అన్నారు. ఒకవేళ వారు కోరితే పరీక్షలకు తాను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నానని సతీష్ అన్నాడు.

కాగా, అయేషా హత్య కేసు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. తీర్పు వెలువరించడానికి ముందు కోర్టు మూడు సార్లు వాయిదా పడింది. సత్యంబాబును మహిళా సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. సత్యంబాబు తల్లి మరియమ్మ కోర్టు వద్ద బోరున విలపిస్తోంది. సత్యంబాబు పాత్ర అయేషా హత్యలో లేదని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X