వైయస్ జగన్ కు వచ్చేకన్నా ఎక్కువ జనం వస్తారు: ఎంపీ వివేక్

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: డబ్బులు ఇస్తే జనాలు వస్తారా అన్న నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని కాంగ్రెసు ఎంపీ వివేక్ అన్నారు. మూడు నియోజక వర్గాలకు కలిపి 3 కోట్లు రూపాయలు ఇస్తే తాను సభను ఏర్పాటు చేసుకుంటానని అన్నారు. అలా డబ్బులు ఇస్తే జగన్ కంటే ఎక్కువ మందే తన సభకు వస్తారని, ఒకవేళ అంతమంది జనాలు రాకుంటే తను మేకపాటి వేసే ఏ శిక్షకైనా సిద్ధమేనని అన్నారు. మేకపాటి ఎంత త్వరగా తనకు మూడు కోట్ల రూపాయలు పంపితే అంత తొందరగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జనాలను చూపిస్తానని ప్రతి సవాల్ విసిరారు.

మంగళవారం కాంగ్రెసు సీనియర్ నాయకులు వి.హనుమంతరావు డబ్బులు ఇస్తేనే జగన్ సభకు అంతమంది జనాలు వస్తున్నారని ఆరోపించారు. దానికి మేకపాటి స్పందిస్తూ హనుమంతరావు సభలు ఏర్పాటు చేసుకుంటే తాను డబ్బులు ఇస్తానని, సభలు ఏర్పాటు చేసుకొని ఎంతమంది జనాలు వస్తారో చూసుకొవచ్చునన్నారు. రాష్ట్రంలో తన ప్రజల్లో తనకు ఎంత పరపతి ఉందో హనుమంతరావు తెలుసుకోవచ్చునన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ తనకిష్టమున్న ప్రాంతంలో సభ ఏర్పాటు చేసుకొని పరిశీలించుకోవచ్చునన్నారు. దీంతో మేకపాటి సవాల్ కు ఎంపీ వివేక్ స్పందించి, తనకు డబ్బులు ఇస్తే సమావేశాలు పెట్టుకోవడానికి సిద్ధమని చెప్పారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+