సత్యంబాబుకు శిక్ష: కోర్టుకు తాళాలు, తీవ్ర నిరసనలు

Ayesha
విజయవాడ: అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబుకు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ తీవ్ర ఆందోళన చెలరేగింది. మహిళా సెషన్స్ కోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ శిక్షను ప్రతి ఒక్కరూ నిరసించారు. కోర్టు ఆవరణకు గల గేటుకు తాళాలు వేసి ఆందోళన సాగించారు. ప్రజా సంఘాలు, ముస్లిం సంఘాలు, దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. తీర్పును తీవ్రంగా తప్పు పడుతూ ఆందోళన చెలరేగింది. ఈ తీర్పును అయేషా తల్లి శంషాద్ బేగం కూడా నిరసించింది. తన కూతురు అయేషా హత్యలో సత్యంబాబు పాత్ర లేదని ఆమె చెప్పింది. తీర్పు వెలువడిన వెంటనే సత్యంబాబు తల్లి మరియమ్మ స్పృహ తప్పి పడిపోయింది. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని భావించామని, పోలీసుల కళ్లు చల్లబడ్డాయని ఆమె వ్యాఖ్యానించింది. అయేషా హత్య కేసుతో తనకు కుమారుడికి సంబంధం లేదని, ఈ తీర్పుతో తాము ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని అన్నది.

ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. కోర్టు ఆవరణకు వేసిన తాళాలను తీశారు. సత్యంబాబును జైలుకు తరలించారు. తీర్పు వెలువరించిన న్యాయమూర్తికి ఉద్దేశ్యాలు అంటగట్టకూడదని డిఫెన్స్ లాయర్ అన్నారు. కేసులో లొసుగులు ఏమున్నాయో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని న్యాయవాదులు చెప్పారు. న్యాయవాదులు కూడా కోర్టు తీర్పుపై నిరసన వ్యక్తం చేశారు. సత్యంబాబుకు ఉరిశిక్ష వేయవద్దని డిఫెన్స్ లాయర్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిశీలనకు తీసుకుంది. సత్యంబాబుకు అయేషా మీరా కేసుతో ఏ విధమైన సంబంధం లేదనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కోర్టు కేవలం సాంకేతిక సాక్ష్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ కేసులో ఏవీ లేవని, ఈ స్థితిలో సత్యంబాబుకు శిక్ష వేయడం సరి కాదని వాదిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+