లంచాలు అలవాటు చేసింది ఆంధ్రావాళ్లే: కె చంద్రశేఖర రావు
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా తిరుగుతున్న శ్రీనివాస్గౌడ్ను బదిలీ చేయాలని ఓ ఎమ్మెల్యే అడిగితే బదిలీ చేసేస్తారా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ తరహా కక్ష సాధింపును విడనాడాలని కోరారు. హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ శతాబ్ది ఉత్సవాల రోజున ప్రభుత్వ సెలవు దినం ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఒంటరిగా ఉంటే దెబ్బ తీస్తారని చెబుతూ, సంఘటితంగా ఉండాలని, ఐక్యతే శ్రీరామరక్ష అని విద్యుత్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నవంబరులో రామబాణం లాంటి తెలంగాణ పత్రికను తీసుకువస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ను తాము అభివృద్ధి చేశామని సీమాంధ్రులు చెబుతున్నారని, వారి కంటే ముందే నిజాం హయాంలోనే తెలంగాణలో విద్యుత్ సౌకర్యం వచ్చిందన్నారు.
కోదండరామ్ మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని వాణిజ్యానికి వాడుకుని నాశనం చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఉండటం ఇష్టంలేదని, అందుకే తెలంగాణ ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తుందని ఆరోపించారు. టీఎన్జీఓ అధ్యక్షుడు కె.స్వామిగౌడ్ మాట్లాడుతూ రూ.60 వేల కోట్లను మాయం చేసిన 'ఎమ్మార్ ప్రాపర్టీస్' దొంగల ముఠాను వదిలేసి.. తెలంగాణ ఉద్యోగులను అణచివేసేందుకు ప్రయత్నిస్తే సహించబోమన్నారు. తెలంగాణ విద్యుత్తు ఉద్యోగుల ఐకాస(టీ జాక్) అధ్యక్షుడు రఘు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్గౌడ్, ఆర్టీసీ ఐకాస నేత ఆనందం తదితరులు పాల్గొన్నారు.