టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి రోశయ్య విసుర్లు

Rosaiah
హైదరాబాద్: తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వారికి ప్రధాని రాష్టానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియదన్నట్లు రాద్దాంతం చేయటం సబబు కాదని ముఖ్యమంత్రి రోశయ్య మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు చర్యలు రాష్ట్రాన్ని కించపర్చేలా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేనివారే ఇలా ప్రవర్తిస్తారన్నారు. చంద్రబాబు నాయుడికి సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేకనే ఇలా ప్రవర్తించారని అరోపించారు.

పార్టీలు బయట ఒకమాట లోపల ఒకమాట మాట్లాడటం సరికాదన్నారు. అఖిలపక్షంలో ఓ మాట మాట్లాడి బయట మరోవిధంగా పలు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు. టాటా ఇన్సిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ను అడ్డుకోవటం ప్రగతి నిరోధక చర్య అవుతుందన్నారు. ప్రగతిని కాంక్షించేవారు పరిశ్రమల అభివృద్ధిని అడ్డుకోరన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తో అఖిలపక్షాన్ని కలిపించడానికి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేశామని, అయితే ఆయనకు సమయం లేనందున కలవలేక పోయారన్నారు. దీనిని ప్రతిపక్షాలు అర్థం చేసుకోకపోవటం శోచనీయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+