కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajendra Prasad
డల్లాస్: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాచర్ల రాజేంద్రప్రసాద్(28) అనే తెలుగు యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. టెక్సాస్ రాష్ర్టలోని ఆస్టిన్ నగరంలో అక్టోబర్ 17న అతడు మరణించాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో శుక్రవారం రాత్రి అతడిని సెయింట్ డేవిడ్ నార్త్ ఆస్టిన్ ఆస్పత్రికి తరలించారు. మెదడు నాళాలు వాచాయని వైద్యులు గుర్తించారు. కోమాలోని వెళ్లిపోయిన రాజేంద్రప్రసాద్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. దాంతో అతను మరణించాడు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షకవాబ్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహమైంది. అతడి భార్య ర జని (25) మూడు నెలల క్రితమే ఇక్కకి వచ్చింది. తన భర్త మరణంతో ఆమె దిగ్భ్రాంతికి గురయింది. రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రయత్నిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X