అమెరికాలో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్ మృతి
కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆస్టిన్లోని చార్లెస్ షకవాబ్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహమైంది. అతడి భార్య ర జని (25) మూడు నెలల క్రితమే ఇక్కకి వచ్చింది. తన భర్త మరణంతో ఆమె దిగ్భ్రాంతికి గురయింది. రాజేంద్రప్రసాద్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రయత్నిస్తోంది.
Comments
Story first published: Tuesday, October 19, 2010, 16:45 [IST]