వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మట్టిమిద్దె కూలి మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahaboobnagar District
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాలో మట్టి మిద్దె కూలి మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నిద్రలోనే వారు తుది శ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. వర్షానికి ఇల్లు నానిపోయి బుధవారం రాత్రి ఇల్లు కూలింది. గురువారం తెల్లవారి చూసే సరికి ముగ్గురు మరణించారు.

బుధవారం సాయంత్రం వరకు గ్రామస్తులతో కలివిడిగా తిరిగిన ఆ ముగ్గురు రాత్రికి రాత్రి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నర్సయ్య, ఆయన భార్య పుల్లమ్మ, మూడేళ్ల కుమారుడు మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాలను వెలికి తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X